యునైటెడ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టర్ కౌన్సిల్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శ్రీకాళహస్తికి చెందిన సిటిజెన్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావును నియమించారు.
ఈ మేరకు ఆ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు ఆర్ ప్రసాద్ రావు, డైరెక్టర్ కె. జాన్ బాబు నియామక ఉత్తర్వులు పంపారు.
ఈ సందర్భంగా కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవ హక్కులను కాపాడుటానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
మానవ హక్కుల పట్ల అందరికీ అవగాహన కల్పిస్తానని తెలిపారు. అందరినీ కలుపుకొని సంఘ శ్రేయోభిలాషులు, మేధావులు, పెద్దల సలహాలు, సూచనలతో నిస్వార్ధంగా పని చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా యు హెచ్ ఆర్ పి సి నేషనల్ లెవెల్, ఆంధ్ర ప్రదేశ్ కమిటీ సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
Discussion about this post