చిత్తూరు జిల్లా. నగరి నియోజకవర్గం . నగరి పట్టణ వర్ష బాధితులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.
గత 20 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షానికి జీవనాధారం పూర్తిగా కోల్పోయి నిరాశ్రయులుగా, వున్న కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయంగా నగరి ఓంశక్తీ ఆలయం ఆధ్వర్యంలో బియ్యం ప్రతి కుటుంబానికి 5 కిలో చొప్పున అందించటం జరిగింది.
నగరిలో నిరాశ్రయులు అయిన కుటుంబాలను స్వచంధ సంస్థలు ఈ సమయములో అదుకోవాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
నగరి ఆలయం చుట్టూ వున్న ST కాలనీ .మరియు BC కాలనీ వారికి. వృద్ధులకు సహాయం అందించారు. ఈ కార్యక్రమమునకు సహకరించిన ధాతలకు .పట్టణ వాసులకు. నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగరి ఫైర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం రెడ్డి మరియు సహచర బృందం పాల్గొని భాధితులకు వారి చేతుల మీదుగా పంపిణీ చేస్తూ ఆలయం వారు చేస్తున్నా కార్యక్రమంని అభినంధించారు.
.