హుసేన్ సాగర్ పటిష్టత పరిశీలనకు నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ చైర్మన్, మరో 9 మంది సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు అయింది. కమిటీలో సభ్యునిగా ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఇద్దరు ఈఎన్సీలు, ముగ్గురు చీఫ్ ఇంజినీర్లు, ముగ్గురు ఐఐటీ ప్రొఫెసర్లు మరో ఇద్దరు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హుసేన్ సాగర్ ను పటిష్టంగా మార్చడానికి సంబంధించి మొత్తం 4 అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
హుస్సేన్ సాగర్ ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ సవాళ్లు, దాని పటిష్టత, నీటి సామర్థ్యత పరిస్థితి, వరద కాలువల పరిస్థితి, పటిష్టతను మెరుగుపరచడం తదితర అంశాలపై అధ్యయనం చేసి 15 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశం.
హుస్సేన్ సాగర్ సుందరీకరణ గురించి ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని సంవత్సరాల కిందట హుస్సేన్ సాగర్ సుందరీకరణ ప్రాజెక్టు ప్రారంభం అయింది. క్రమం తప్పకుండా పనులు జరుగుతూ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ బలోపేతం చేయడం కోసం కమిటీని నియమించారు. ఈ కృషి తో పాటు సుందరీకరణ ప్రాజెక్టును కూడా త్వరిత గతిన పూర్తి చేస్తే బాగుంటుందని నగర ప్రజలు కోరుకుంటున్నారు.
Discussion about this post