రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ దంపతులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను, కాఫీ టేబుల్ బుక్, 2022 డైరీ, క్యాలెండర్, అగరబత్తులు అందజేశారు.
టిటిడి సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post