పౌష్టికాహారం, వ్యాయామంతోనే కండరాలు, ఎముకలు బలిష్టంగా ఉంటాయని, తద్వారా మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు వీలవుతుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సుకుమార్ తెలిపారు.
చెన్నైకి చెందిన ఇంటాస్ కంపెనీ సహకారంతో, ఆర్థో వైద్యనిపుణులు డాక్టర్ సుకుమార్. డాక్టర్. సుధారాణి నేతృత్వంలో మంగళవారం తిరుపతిలోని సాయి సుధా మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో బి ఎం డి పరీక్షను నిర్వహించారు. మందులను ఉచితంగా పంపిణీ చేశారు.
అదే సమయంలో మానవునికి సంబంధించిన ఎముకలు, కండరాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే.. సంపూర్ణ ఆరోగ్యానికి మూలం అన్నారు. ఆధునిక యుగంలో మనిషి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో సాయి సుధా హాస్పిటల్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. అదే సమయంలో పేద రోగులకు బాసటగా నిలుస్తుందని డాక్టర్ సుకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, సుజాత, డాక్టర్ హిమబిందు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
.

Discussion about this post