అయోధ్య అనేది ఎన్ని విధాల గొప్పదో.. భారతీయులకు, ప్రధానంగా హిందువులందరికీ తెలుసు. అయితే అయోధ్యకు సంబంధించిన ఒక ఘనతను గిన్నిస్ బుక్ తాజాగా గుర్తించింది.
రామజన్మభూమిగా పేరొందిన అయోధ్య ఇప్పుడు గిన్నీస్ బుక్ లో కూడా చోటుచేసుకుంది. సుమారు ఆరు లక్షల దీపాలకు పైగా వెలిగించి ఈ రికార్డును కైవసం చేసుకుంది. దీపావళి సందర్భంగా మనం ఎన్ని దీపాలను వెలిగిస్తాం… ఏవో కొన్ని… రాష్ట్రం మొత్తంగా తీసుకున్నా… కొన్ని వేలల్లో ఉండవచ్చేమో… కానీ ఏకంగా ఆరు లక్షల దీపాలను ఒకేసారి వెలిగిస్తే… అవి ఎంతటి కాంతులను వెదజల్లుతాయోకదా… అందునా రాత్రిపూట… ఇక చెప్పనవసరం లేదు. అంతటి కాంతులతోబాటు ఎంతో శోభాయమానంగా కనిపిస్తుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన నాటినుండి అనగా 2017 నుండి ప్రతి దీపావళికి దీపాలను వెలిగించేలా చేస్తూ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అదికూడా నూనె దీపాలు. ఈ దీపాల సంఖ్యను ఏటకేడు పెంచుకుంటూ పోతున్నారు. ఈ నేపధ్యంలో 2020 దీపావళి నాటికి 6,06,569 చమురు దీపాలను వెలిగించి రికార్డు సృష్టించారు. ఈ దీపాలను వెలిగించడంలో రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయానికి చెందిన 8000 మంది విద్యార్ధులు కీలకపాత్ర పోషించారు. వారితోపాటు ఆ రాష్ట్ర పర్యాటక రంగం కూడా ఈ విషయంలో ఎంతగానో కృషి చేసింది. వీరి కృషిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంస్థ ఎంతగానో అభినందించింది. అయోధ్యలోని సరయూనది ఒడ్డున రామ్ కీ ఫైడీ ఘాట్ల వద్ద సుమారు ఐదు నిముషాల పాటు ఈ దీపాలు కాంతులు వెదజల్లాయి.
.

Discussion about this post