టీటీడీ రవాణా విభాగం లో శుక్రవారం ఆయుధపూజ వేడుకగా నిర్వహించారు . ఈవో ఎవి ధర్మారెడ్డి , జేఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , సివిఎస్వో నరసింహ కిషోర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
ముందుగా ట్రాన్స్పోర్ట్ కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవో కు ఆ విభాగాధిపతి శేషారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు . అనంతరం వీరు వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆయుధ పూజలో పాల్గొన్నారు .అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం జిఎం శేషారెడ్డి ఈవో , జేఈవో లు ,సివిఎస్వో ను శాలువాతో సత్కరించారు .
ఈ సందర్బంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ , వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ప్రతి ఏటా దీపావళి ముందు ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు.
ఇందులో భాగంగానే శుక్రవారం ఆయుధ పూజ చేశామని ఆయన తెలిపారు .
ట్రాన్స్ పోర్ట్ ఎ ఎం ఎఫ్ లక్ష్మీ ప్రసన్న , డి ఐ మోహన్ తో పాటు పలువురు అధికారులు , ఉద్యోగులు పాల్గొన్నారు .
.

Discussion about this post