కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ దాని బారిన పడి మృతి చెందే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకవైపు కరోనా భారత్లో అదుపులోకి వస్తోంది కొన్ని సర్వేలు చెబుతున్నా… మరోవైపు కరోనా ఉధృతి పెరుగుతోందని మరికొన్ని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న వివరాల ప్రకారం భారతదేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసులు ప్రస్తుతం 85 లక్షలకు చేరగా, కరోనాతో సుమారుగా ,1.26 లక్షల మంది మృతిచెందారని ఈ వివరాలు చెబుతున్నాయి.
గడచిన 24 గంటల్లో దేశంలో 45,903 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 490 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 85,53,657 కేసులు, నమోదైనట్లు, అలాగే కరోనా సోకి 1,26,611 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి దేశంలో 5,09,673 యక్టీవ్ కేసులు నమోదుకాగా, ఇప్పటివరకూ 79,17,373 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది.
నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 48,405 మంది బాధితులు కోలుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 92.56 శాతం, యక్టివ్ కేసులు 5.96 శాతం, మరణాల రేటు 1.48 శాతంగా ఉందని ఈ శాఖ తెలిపింది.
మరోవైపు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు సంఖ్య కూడా పెరుగుతోందని, గడిచిన 24 గంటల్లో 8,35,401 టెస్టులు నిర్వహించినట్టు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,85,72,192 టెస్టులు నిర్వహించినట్టు ఈ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 2074 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1141 ప్రభుత్వ లాబ్స్,933 ప్రైవేట్ లాబ్స్
ప్రజలకు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఒకవైపు కరోనా ఉధృతి ఈ కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని ఒకపైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపధ్యంలో అందరం కూడా సామాజిక దూరం పాటించి, అందరం ఆరోగ్యంగా ఉందాం.. అని మనకు మనమే హెచ్చరించుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం. కరోనానుండి సురక్షితంగా మనల్ని మనం రక్షించుకుందాం..!
.

Discussion about this post