స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో హైకోర్టు తీర్పు చెప్పేసింది. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్కు అనుకూలంగా ఉంది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేయడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఒకప్పుడు కరోనా బూచిని చూపి.. ఎన్నికలను ఆపేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇప్పుడు సత్వరమే నిర్వహించేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. కొవిడ్ 19 తగ్గుముఖంలో ఉన్నప్పటికీ.. అది వ్యాపించగల సంభావ్యత పరంగా కొవిడ్ వాతావరణాన్ని గమనించినప్పుడు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించదలచుకుంటే గనుక.. అది రాష్ట్రానికి పెద్ద ద్రోహం చేసినట్టే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిమ్మగడ్డ రమేష్ రమేష్ కుమార్ వ్యవహార సరళి తొలినుంచి కూడా ప్రభుత్వంతో వైరం పెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్నారనే అభిప్రాయం పలువురికి ఏర్పడింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.
అదంతా పక్కన పెడితే.. తాజా వ్యవహారాల్లో నిమ్మగడ్డ వైఖరి మరోసారి ప్రశ్నార్థకం అవుతోంది. ఎన్నికల సంఘం నిర్వహణ ఖర్చులకు కూడా రాష్ట్రప్రభుత్వం డబ్బులు విడుదల చేయకుండా.. ఇబ్బంది పెడుతున్నదని ఆయన కోర్టుకెళ్లారు. దానికి సమాధానంగా ప్రభుత్వం ఈసీకి ఎంతెంత నిధులు విడుదల చేస్తున్నదో సర్కారులెక్క చెప్పింది. ఆ గొడవ పక్కన పెడితే.. స్థానిక సంస్థల ఎన్నికలు అర్జంటుగా నిర్వహించేయడానికి ఆయన చూపిస్తున్న ఉత్సాహం మాత్రం తప్పు.
రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేం అని ప్రభుత్వం చెప్పింది. కానీ నిమ్మగడ్డ ఏదో ప్రభుత్వంతో పంతానికి పోతున్నట్టుగా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అనుకుంటున్నట్టున్నారు. ప్రభుత్వం చాలా క్లారిటీతో ఎన్నికల విధులకు అవసరమైన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఇప్పటికే కొవిడ్ నివారణ, సహాయక చర్యల్లో పాల్గొంటూ చాలా మంది కొవిడ్ బారిన పడ్డారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణతో మళ్లీ వాళ్లను ఇబ్బంది పెట్టలేం అని పేర్కొంది.
అయితే నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల నిర్వహణకు అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని.. ముందుకు దూసుకుపోతున్నట్లుగా ఉన్నారు. ఆయన ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకుని షెడ్యూలు ప్రకటిస్తే గనుక.. రాష్ట్రానికి చాలా పెద్ద ద్రోహం చేసినట్టే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ మొదలవుతోందనే మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూడా తీవ్రత ఇంకా తగ్గలేదు.
ఇవి కూడా చదవండి :
కరోనా హెచ్చరిక : ముందుంది ముసళ్లపండుగ
మూవీ రివ్యూ మిస్ ఇండియా కాదు ‘మిస్ చాయ్’
విజయశాంతి కోసం ట్రై చేయడం వర్తీయేనా?
ఏటీఎంకు వెళ్లకుండా నోట్ల కట్టలు ఏమయ్యాయి?
మానవ కంప్యూటర్ బిరుదును అసహ్యించుకున్న మేథావి
అసెంబ్లీ ఎన్నికలతో పోల్చడం సరికాదు
నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు. అక్కడ ఎన్నికలు జరిపినప్పుడు.. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు జరపలేం అనేది ఆయన ప్రశ్న. టెక్నికల్గా ప్రశ్న కరక్టే. అసెంబ్లీ పదవీకాలం పూర్తియపోతే.. ప్రభుత్వమే లేకుండా పోతుంది. రాష్ట్ర పాలనకు అది చాలా పెద్ద దెబ్బ. అందువల్ల జాగ్రత్తలతో, భయాలతో ఎన్నికలు నిర్వహించడం అవసరం. కానీ.. ఇక్కడ ఏపీలో అలా కాదు. ఇవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు. ఇవి కొద్దిగా జాప్యం జరిగినంత మాత్రాన.. అభివృద్ధి ఆగిపోయేది ఉండదు. ప్రభుత్వం ఉంది.. వ్యవస్థలు ఉన్నాయి. పాలన సవ్యంగానే సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అర్జెన్సీ లేదు. అత్యవసరం కానీ ఎన్నికలను ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించడం అవసరమా? అనేది ప్రశ్న.
నిమ్మగడ్డకు ఆ మాత్రం తెలియదా?
స్థానిక సంస్థల ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఏడాది ప్రారంభంలో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తయింది. చాలా ఏకగ్రీవాలు అయ్యాయి. కొవిడ్ పేరు చెప్పి హఠాత్తుగా ఎన్నికలను ఆపేశారు. వాయిదా వేశారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ హవా బాగా ఉన్న సమయంలో.. ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వం పట్టుబడితే.. కరోనాను బూచిగా చూపించి కోర్టులో నెగ్గారు.
ఒక్క విషయం గమనిస్తే.. నిమ్మగడ్డ ఎలాంటి ఉద్దేశంతో వ్యవహరించారో అర్థమవుతుంది. ఆయన స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన నాటికి.. రాష్ట్రవ్యాప్తంగా కేవలం రోజుకు వందల సంఖ్యలో మాత్రమే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. అలాంటప్పుడు వాయిదా వేశారు. ఇప్పుడు రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు నిర్వహించి తీరుతా అంటున్నారు. అదే జరిగితే రాష్ట్రానికి ద్రోహం కాక మరేమిటి?
మొన్నటిదాకా ఏపీలో రోజుకు పదివేల కేసుల వంతు నమోదు అవుతూ వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం చాలా గట్టి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అవి రోజుకు 2500 కేసుల వరకు వచ్చాయి. పదివేలతో పోల్చుకుని.. ఇప్పుడు కేసులు తగ్గాయి గనుక.. ఎన్నికలు నిర్వహించేద్దాం అని వాదించడం కరెక్టు కాదు. తాను ఎన్నికలు వాయిదా వేసిన నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు కొవిడ్ ఎంత దారుణంగా ఉందో గమనించాలి. అప్పుడు రోజుకు వందల్లో ఉంటే.. ఇప్పుడు రోజుకు మూడు వేల వరకు ఉంటున్నాయి. మరి అప్పుడు ఆపేసి, ఇప్పుడు నిర్వహిస్తాననడం ఎలా కరెక్టు. కాస్త ఆలోచన ఉన్న ఎవరికైనా సరే.. నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు పూనుకుంటూ అది ద్రోహమే అని అర్థమైపోతుంది.
.

Discussion about this post