పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు ప్రముఖ సేవాసంస్థ రామ్కీ ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం సుమారు 6511 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని యువతీయువకులకు శిక్షణ అందించనున్నట్లు రామ్కీ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంవీ రామిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారి సాంకేతిక సహకారంతో కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ల ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, మాచర్ల, బాపట్ల, కర్నూలు, మచిలీపట్నం, చల్లపల్లి, ఒంగోలు, విశాఖపట్నం, తిరుపతి కేంద్రాల్లో ఈనెల 10న ఉదయం 9.30 గంటలకు ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నేటి నుంచి 6వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తుకు అవకాశం
అర్హత పరీక్షకు సంబంధించి నేటి నుంచి 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంవి రామిరెడ్డి సూచించారు. అందులో ఉత్తీర్ణత సాధించిన 300 మంది యువతీయువకులకు గుంటూరు జిల్లా పెదపరిమిలోని రామ్కీ ఫౌండేషన్ నైపుణ్య శిక్షణకేంద్రంలో శిక్షణతోపాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.
మరో 500 మంది యువతకు ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు రామిరెడ్డి పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా అభ్యర్థులకు ప్రతి ఆదివారం మాక్ పరీక్షలు నిర్వహిస్తారు. 10వ తేదీన అర్హత పరీక్ష అనంతరం రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. అర్హత సాధించిన యువతకు ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్స్, మెయిన్ పరీక్ష వరకు ఉచితంగా శిక్షణ ఉంటుంది.
అర్హత పరీక్షకు పేర్లు నమోదు చేసుకోవటానికి పూర్తి సమాచారం కోసం రామ్కీ ఫౌండేషన్ వెబ్సైట్ www.ramkyfoundation.org ను వీక్షించాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబరు 9390502357 లో సంప్రదించవచ్చు.
Discussion about this post