ఆరేళ్ల పసిపాపపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన రాజు ఎపిసోడ్ అర్థంతరంగానే ముగిసింది. పోలీసులు తీవ్రస్థాయిలో ఉచ్చు బిగించడంతో రాజు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి చావుకు ముందే అదే తరహాలో మరో దుర్ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
ఇంటర్మీడియట్ చదివే కుర్రాడు ఆరేళ్ల పాప మీద అదే తరహాలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో హత్య జరగలేదు. అయితే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు పన్నిన ఉచ్చుకు బెదిరి, తప్పించుకోవడం అసాధ్యం అని భావించిన రాజు భయంతో ఆత్మహత్య చేసుకోగా, అతని కుటుంబసభ్యులు మాత్రం పోలీసులను నిందిస్తున్నారు. పోలీసులే కాల్చి చంపి పట్టాలపై పడేశారని అంటున్నారు.
నిజానికి పోలీసులు అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించడంతో రాజుకు తప్పించుకునే అవకాశాలు లేకుండాపోయాయి. దీంతో అతను ఆత్మహత్య చేసుకోవచ్చుననే అభిప్రాయం పోలీసులకు ముందే కలిగింది. ఆ అనుమానంతో పరిసర ప్రాంతాల్లో మార్చురీల్లోని గుర్తు తెలియని శవాలను కూడా వారు రెండు రోజులుగా పరిశీలిస్తున్నారు. ఈలోగా అతడి ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది.
ఒక రాజు దురాగతం, ఒక జగిత్యాల ఘోరం వరుస సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
పోలీసులు కాల్చిచంపారా?
రాజు కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదు. సంచలనం రేకెత్తించిన సైదాబాద్ హత్యాచారంలో రాజు లాంటి కర్కోటకుడైన నిందితుడు పోలీసులకు చిక్కి ఉంటే గనుక.. మీడియాకు చూపించి.. ఆ తర్వాత ఎన్ కౌంటర్ చేసి.. అలాంటి తప్పులు చేసే వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తారే తప్ప.. గుట్టు చప్పుడు కాకుండా ఎందుకు చంపుతారని ప్రజలు అనుకుంటున్నారు. పోలీసులకు చిక్కి ఉన్న రాజుకు చావు తప్పేది కాదని, దానిని అతనే కొని తెచ్చుకున్నాడని అంటున్నారు.
రాజును పట్టిచ్చిన వారికి పోలీసులు ప్రకటించిన పది లక్షల రూపాయల రివార్డును కూడా హత్యాచారంలో బిడ్డను కోల్పోయిన కుటుంబానికే ఇవ్వాలనే డిమాండ్ కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది.
.

Discussion about this post