అక్కినేని నాగచైతన్య ఈ మధ్యనే ‘శైలజా రెడ్డి అల్లుడు’ గా మనముందుకు వచ్చాడు కానీ మెప్పించలేకపోయాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ చైతూ తర్వాత సినిమా అయిన ‘సవ్యసాచి’ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన టీజర్ ఈ సినిమా అన్ని సినిమాలలా కాదని, సరి కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతుంది అనే విషయాన్ని తెలిపింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో మనముందుకు రానుంది.
అయితే సినిమా పై అంచనాలను మరింత పెంచడానికి ప్రమోషన్స్ ను మరింత పెంచాలనే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ముందుగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ నెల అక్టోబర్ 21 వ తారీకున ‘సవ్యసాచి’ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుక నోవోటెల్ లేదా ఎన్ కన్వెన్షన్ హోటల్ లో జరగనుంది. ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాధవన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా నాగ చైతన్య కెరీర్ లో ఒక మంచి హిట్ గా మిగులుతుందా లేదా అనేది చూడాలి.
.
Discussion about this post