తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ఇదివరకే భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రకటనలు చేశారు. అంతేకాక తిరుపతికి పలువురు నాయకులు విచ్చేసి ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశాలను నిర్వహించారు. రాష్ట్ర,జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ సునీల్ దేవధర్ సైతం తిరుపతి లో పర్యటించారు.
రాబోయే ఉప ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అయితే జనసేన పార్టీ, భారతీయ జనతాపార్టీతో కలసి ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తాను పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీకి జనసేన బేషరతుగా మద్దతు ప్రకటించింది. దీంతో తిరుపతి లోక్ సభ స్థానాన్ని తమకు ఇవ్వాలని జనసేన పార్టీ నేతలు కోరుకుంటున్నారు.
అంతేకాకవర్గం తమ వెంటే ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ భాజపా చీఫ్ జేపీ నడ్డా తో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య మంతనాలు వెలుగులోకి రానప్పటికీ తిరుపతి ఉప ఎన్నిక ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలోని జనసేన ముఖ్య నేతల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకోవడానికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మూడో తేదీ నుంచి మూడు రోజులపాటు తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, వెంకటగిరి తదితర ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. బాధిత రైతులతో మాట్లాడతారు.అదే సందర్భంలో పార్టీ ముఖ్య నాయకులు తోనూ సమావేశమై ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుంది, స్థానిక పరిస్థితులు, భాజపా నాయకులు సహకారం తదితరాలను చర్చించనున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన తో ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా లేదా భాజపాకు మద్దతు ఇస్తుందా అనే విషయం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
.
Discussion about this post