ప్రభుత్వాలు తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాల పట్ల తమ తమ నిరసనలు వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు అనేక మార్గాలు అనుసరిస్తుంటాయి. ధర్నాలు, సమ్మెలు, బంద్ లు, హర్తాళ్లు వంటివి అందరూ చేసే నిరసన మార్గాలు. అయితే కొందరు నాయకులు చాలా వెరైటీగా తమ తమ నిరసనలు తెలియజేసి జనం దృష్టిని ఆకర్షిస్తుంటారు. నిరసనల రూపంలో కామెడీ ఉండడం వలన సమస్యలు పరిష్కారం అవుతాయని కాదు గానీ.. కనీసం మామూలు నిరసనల కంటె ఎక్కువగా జనం దృష్టి ఆ అంశం మీద పడుతుంది.
కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు కె.నారాయణ అదే పని చేశారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల మీద, చెప్పుల మీద జీఎస్టీ పెంచేసి తీవ్రమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధింపు ఇప్పుడే కాదంటూ కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది కూడా.
అయితే ఈ నేపథ్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కె.నారాయణ చెప్పులపై పన్ను విధింపు పట్ల నిరసనను వెరైటీగా వెలిబుచ్చారు. చెప్పు ఇక చాలా విలువైనది అయిపోతుందని ఎద్దేవా చేస్తూ.. తన కాలిచెప్పును తీసి తన నెత్తిమీదే పెట్టుకుని.. ఆయన ప్రభుత్వం తీరును ఎండగట్టారు.
ఈ తర:హాలో.. తమ నిరసనకు కామెడీని జోడించి వ్యతిరేకతను తెలియజేసేవారు ఈ మద్య కాలంలో తగ్గిపోయారు. రాజకీయాల్లో సీరియస్ నెస్ పెరిగిపోయింది. గతంలో కర్నూలు నగరానికి మేయర్ గా పనిచేసిన బంగి అనంతయ్య ఇలాంటి వెరైటీ వేషాలకు పెట్టింది పేరు. కేవలం ఇలా చెప్పులను నెత్తిన పెట్టుకునే నిరసనలే కాదు.. రకరకాల వేషధారణల్లో ఆయన ప్రభుత్వాల తీరును ఎండగడుతూ.. ప్రజల దృష్టిని ఆకర్షించే వారు.
బంగి అనంతయ్య తర్వాత.. తెలుగుదేశానికే చెందిన ఎంపీ శివప్రసాద్.. రాష్ట్ర విభజన సమయంలో.. రకరకాల ఫ్యాన్సీ డ్రస్ లను తలపించే వేషాలతో పార్లమెంటు ఎదుట హడావుడి చేస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసేశాడు. వీరిద్దరూ పోయిన తర్వాత.. అలా.. ప్రభుత్వం తీరు పట్ల తిరస్కారానికి వెటకారం కూడా జోడించి మాట్లాడే వాళ్లు తక్కువయ్యారు.
ఇప్పుడు కె.నారాయణ ఆ లోటు భర్తీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన నెత్తిన చెప్పును పెట్టుకుని తెలిజేసిన నిరసన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా ఇలా చేయాలని ప్లాన్ చేసుకుంటే నాయకులు కొత్త చెప్పులు తెప్పించి.. ఇలా చేస్తుంటారు. అక్కడే ఉంది నారాయణ వెరైటీ. ఆయన తన కాలి చెప్పునే తీసి తన నెత్తిమీద పెట్టుకుని.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
.

Discussion about this post