సాధారణంగా దీపావళి పండుగ వస్తోంది అంటే అందరికీ సంబరమే… అందునా పిల్లలకైతే చెప్పనక్కర్లేదు. వారి సంబరమే సంబరం… టపాకాయలు కాల్చడం, కొత్త బట్టలు, పిండివంటలు… ఇలా అన్నీ వారికి ఇష్టమైనవే… అందుకే పిల్లలకు, పెద్దలకు కూడా దీపావళి పండుగ అంటే చాలా ఇష్టం. అయితే ఈసారి దీపావళి పండుగను చాలా జాగ్రత్తగా జరుపుకోమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కరోనా విలయం జరుగుతున్న నేపధ్యంలో అసలు దీపావళి పండుగ సంబరాలను కాస్త తగ్గించుకుంటే మంచిదని మేధావులు చెబుతున్నారు.
కరోనా వైరస్ గాలిలో చాలా దూరం వరకు ప్రయాణం చేస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. అందరూ కూడా మాస్క్ ధరించడం తప్పనిసరి, అలాగే సామాజిక దూరం పాటించడం కూడా తప్పనిసరి అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ నేపధ్యంలో అసలు కరోనా వైరస్ కలుషితమైన గాలి ద్వారా మరింత వేగంగా వ్యాపిస్తుందని తాజాగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దీపావళికి టపాకాయలు కాల్చడం వల్ల గాలిలో ఉన్న చెడు వైరస్ పోతుందని పూర్వకాలంలో నమ్మేవారు. దానికి అనుగుణంగా టపాకాయలను కూడా తయారుచేసేవారు. కానీ కాలక్రమేణా పరిస్థితుల్లో, టపాకాయల తయారీలో మార్పులు చోటుచేసుకున్నాయి. రంగురంగుల పువ్వులను వెదజల్లే టపాకాయలు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేయడానికి పలురకాలైన విషపూరిత రసాయనాలను అందులో కలుపుతున్నారు. ఫలితంగా టపాకాయలు కాల్చేవారికి ఆనందాన్ని ఇవ్వడమేకాదు… మరోవైపు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న గాలిని కలుషితం చేస్తున్నాయి. అందుకే టపాకాయలను పూర్తిగా కాల్చవద్దని చెబితే వినరు కాబట్టి తక్కువగా కాల్చమని మొన్నటివరకూ నిపుణులు చెబుతూ వచ్చారు. తాజాగా టపాకాయలు కాల్చిన కలుషితమైన గాలిలో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బాణ సంచా అమ్మకాలను నిషేధించారు. బాణసంచా పొగమాటున కరోనా వైరస్ దాడిచేసే ప్రమాదం ఉందని, ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఏటా టపాకాయల కాలుష్యం వల్ల పలు శ్వాస సంబంధ సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తూనే ఉన్నా టపాకాయల కొనుగోళ్లు తగ్గడం లేదు. ఇకనైనా అందరం కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని టపాకాయలను కాల్చడం పూర్తిగా మానేస్తే మంచిది. అలాగే శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు. ఈ బాణసంచా పొగకు ఎంద దూరంగా ఉంటే అంత మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా వైరస్ కాలుష్యం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతుందని, ముఖ్యంగా బాణసంచా కాల్చేటప్పుడు వెలువడే కాలుష్యం ద్వారా దీని వ్యాప్తి మరింతగా ఉంటుందని, గాలిలోని చిన్న చిన్న ధూళికణాలకు కరోనా వైరస్ అంటుకుని, మన శ్వాసకోశాల్లోకి చేరి మనకు ప్రాణాంతకంగా పరిణమిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
.

Discussion about this post