భారతీయ జనతా పార్టీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి, పాపం, చాలా ఇరకాటం ఎదురయింది. ‘రాష్ట్ర పార్టీలో తనను మించిన నాయకుడు లేడు’ అన్నట్లుగా చెలరేగుతున్న ఆయన అమిత్ షా తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో తలంటుపోయడంతో డంగైపోయారు.
తిరుపతి పార్టీ మీటింగ్లో అమిత్ షా ప్రసంగం సారాంశాన్ని ‘బిట్వీన్ ద లైన్స్’ చదివిన ఎవరికైనా సరే విష్ణువర్ధన్ రెడ్డి కి బీభత్సంగా క్లాస్ పీకినట్టు- చాలా సులువుగా అర్థం అవుతుంది.
ఈ ప్రచారం ద్వారా వాటిల్లే నష్టాన్ని పూడ్చుకోవాలని అనుకున్నారో ఏమో గానీ.. కేంద్ర హోంమంత్రికి తనంటే వల్లమాలిన ప్రేమాభిమానాలు ఉన్నాయని బిల్డప్ ఇవ్వడానికి విష్ణు చాలా తంటాలు పడ్డారు. నిజానికి ఆ తంటాలు కూడా జనానికి నవ్వు పుట్టించేవే.!
ఇంతకు ఏం జరిగిందంటే..
తిరుపతి పార్టీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల గురించి అమిత్ షా కూలంకషంగా చర్చిస్తున్నప్పుడు- సహజంగానే పార్టీ కార్యక్రమాలకు ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ టీవీ ఛానల్ లను రానివ్వకుండా నిషేధించిన సంగతి చర్చకు వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతోందనే కారణాలు కూడా మాట్లాడారు.
ఏబీఎన్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో అమరావతి ప్రాంత ఉద్యమకారుడు విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన సంఘటన, ఆ మీడియా సంస్థలపై ఈ నిషేధానికి అసలు కారణం. అయితే అమిత్ షా కు అచ్చంగా ఈ మాటలు చెప్పలేరు గనుక- రాష్ట్ర నాయకులు బుకాయింపు మాటలు చెప్పే ప్రయత్నం చేశారు.
ALSO READ
చిరు చెల్లెలిగా ఆమె తప్ప మరో ఆప్షన్ లేదు
అమరావతి మహాపాదయాత్రలోకి జనసేనాని పవన్ కల్యాణ్
కుప్పంలో వార్డుల వారీగా వైసీపీ మెజారిటీలు ఇవే!
ఆంధ్రజ్యోతి బీజేపీ పట్ల వ్యతిరేక పోకడలతో ఉంటోందని, మోడీ వ్యతిరేక వార్తలు వేస్తుంటారని, అందువలన రానివ్వడం లేదని చెప్పారు. తమకు నచ్చని వారిని ‘మోడీ వ్యతిరేకులు’గా చిత్రీకరిస్తే అమిత్ షా సైలెంట్ అయిపోతారని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఆయన వారు చెప్పిన సమాచారాన్ని విని ఊరుకోలేదు.
‘తెలంగాణలో బీజేపీ వార్తలకు ఆంధ్రజ్యోతిలో బాగానే ప్రాచుర్యం లభిస్తోంది కదా ఇక్కడ మాత్రం ఏమైంది’ అని ఎదురు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకులలో ఇబ్బంది ఉన్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది తప్ప- వారికి పార్టీ మీద వ్యతిరేకత కాదని తేల్చేశారు. పార్టీ కోసం వ్యక్తులే గాని, వ్యక్తులు పార్టీని శాసించే పరిస్థితి ఉండకూడదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
ఈ చర్చ, అమిత్ షా ఆగ్రహం యావత్తూ అన్యాపదేశంగా ఏం కాదు.. సూటిగా విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహార సరళిని తప్పు పట్టడమే. దీంతో ఖంగుతిన్న విష్ణువర్ధన రెడిడ్డి అప్పటికి మిన్నకుండిపోయారు.
ఈ ఎపిసోడ్లో రెండో భాగం కూడా ఉంది..
తిరుపతి పర్యటనలో భాగంగా అమిత్ షా కపిలతీర్థం కపిలేశ్వర ఆలయాన్ని కూడా సందర్శించారు. ఆయనతో పాటు అందరు పార్టీ నాయకులతో పాటు సహజంగా విష్ణు కూడా ఉన్నారు. ఆ తర్వాత విష్ణువర్ధన రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ‘‘కపిలేశ్వర స్వామి ఆలయంలో హోంమంత్రి తన స్వహస్తాలతో, స్వయంగా తనకు ప్రసాదం చేతిలో పెట్టారని కాబట్టి ఆయనకు తన మీద వల్లమాలిన ప్రేమాభిమానాలు ఉన్నాయని అందుకు కృతజ్ఞతలు అని- అర్థం వచ్చేలా’’ ఆ ట్వీట్ పెట్టారు. అది మీడియాలో కూడా సర్కులేట్ అయింది.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
పార్టీ సమావేశంలో అమిత్ షా మందలించిన ఎపిసోడ్ వలన పోయిన పరువును ఈ రకంగా కాపాడుకోవచ్చునని విష్ణువర్ధన రెడ్డి స్కెచ్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇలా చెప్పుకుంటే.. తన మీద అమిత్ షాకు ఆగ్రహం లేదని, తనకు చాలా క్లోజ్ అని అందరూ అనుకుంటారని ఆయన భావించినట్లుంది.
గుడిలో కూర్చున్నప్పుడు ఎంత పెద్ద నేత అయినా- తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని దగ్గర్లో ఎవరు ఉంటే వాళ్ల చేతిలో కొంత పెట్టడం సహజం! అదేదో తన మీద ఉప్పొంగి పోయే ప్రేమకు రుజువు లాగా ప్రపంచానికి చాటి చెప్పుకొంటూ- విష్ణు ట్వీట్ కింద పెట్టుకోవడం ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. పోయిన పరువును పునరుద్ధరించుకోడానిక పాపం బీజేపీ విష్ణు చాలా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.
.

Discussion about this post