శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం దళిత డప్పు కళాకారుల సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన కళాకారులకు అందరికీ గుర్తింపు కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండు చేశారు. అదేవిధంగా పింఛను కూడా ఇవ్వాలన్నారు.
దేవదాయశాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో డప్పు కళాకారులకు పారితోషికం తో కూడిన ప్రదర్శనలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ పథకాల ప్రచారం లో కళాకారులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి నియోజకవర్గంలో ఉన్న డప్పు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. జీవో నెంబర్ 56 ప్రకారం వాయిద్య పరికరాలు, డ్రెస్సు, గజ్జెలు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీనివాసులు, సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, సత్యవేడు నియోజకవర్గం కార్యదర్శి కత్తి రవి, ఏఐవైఎప్ ఏరియా కార్యదర్శి మల్లికార్జున్, డప్పు కళాకారుల నియోజకవర్గం కార్యదర్శి రోడ్డా గోపి, ప్రజా సంఘాల నాయకులు శేషయ్య, బాబు, బత్తెయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.