తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గడువు తీరిన ఫిక్సెడ్ డిపాజిట్ నిధుల సొత్తును ప్రభుత్వం తీసుకుని, టీటీడీకి బాండ్లు ఇస్తుందని, నిదానంగా అప్పు తిరిగి చెల్లిస్తుందని అంటున్నారు. చరిత్రలో ఎన్నడూ కూడా ఇలా జరగలేదు. దేవుడి సొత్తును ప్రభుత్వాలు తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు ఎక్కడ అప్పు పుడితే అక్కడ తీసుకుని, రోజులు నెట్టే పరిస్థితిలో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విమర్శలకు గురవుతోంది. భక్తులు మనస్తాపానికి గురవుతున్నారు.
.

Discussion about this post