ప్రఖ్యాత చేతి కలంకారీ కళాకారుడు, శ్రీకాళహస్తి కలంకారీకి జాతీయ స్థాయిలో వన్నెతెచ్చిన వ్యక్తి జొన్నలగడ్డ గురప్ప శెట్టి ఆదివారం నాడు శ్రీకాళహస్తిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. చిన్నతనం నుంచి ఆయన శ్రీకాళహస్తి ప్రాంతానికి వన్నెతెచ్చిన చేతి కలంకారీలో అభినివేశం సంపాదించారు. శ్రీకాళహస్తిలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఏకైక కళాకారుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
చేతి కలంకారీ చిత్రాలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధి. ఆ కళకే ఒక గుర్తింపు తీసుకు వచ్చిన ప్రముఖుల్లో జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి ముఖ్యులు. దశాబ్దాల కిందటే ఆయన గీసిన కలంకారీ చిత్రాలకు జాతీయ స్థాయిలో హస్తకళల అవార్డులు లభించాయి. శ్రీకాళహస్తిలో చేతి కలంకారీ చిత్రకళ విస్తృతంగా ప్రాచుర్యంలోకి రావడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. కలంకారీ కళా విస్తృతికి సుదీర్ఘకాలం అందించిన సేవలకు గాను ఆయనకు 2008లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు.
వయోభారం కారణంగా ఆయన అనారోగ్యంతో ఆదివారం మరణించారు.

.

Discussion about this post