శ్రీకాళహస్తి పట్టణంలోని ఆరె మరాఠ (నాన్ – బ్రాహ్మిణ్ ) అసోసియేషన్ ఆధ్వర్యంలో చత్రఫతి శివాజీ 392వ జయంతి వేడుకలను పట్టణంలోని ద స్కూల్లో ఘనంగా నిర్వహించారు .
ఈ సందర్భంగా మరాఠీ యోధుడు చత్రపతి శివాజీ యువతకు ఆదర్శం అని సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్ధన్ రావు జె . పవార్ అన్నారు.
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి శ్రీకాళహస్తిలోని ఘనంగా నిర్వహించారు. మరాఠా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ చిత్రపటాన్ని ఉంచి పూజలు చేసి ఘన నివాళులర్పించారు.
చత్రపతి శివాజీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మరాఠీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ద స్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రావు పవార్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ అత్యున్నత నైతిక విలువలతో హిందూ సామ్రాజ్యానికి మార్గదర్శకం వహించారన్నారు.
నేటి యువతకు చత్రపతి ధైర్య సాహసాలు ఆదర్శం అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు .
ఈ కార్యక్రమంలో మరాఠీ సంక్షేమ సంఘం నాయకులు రాజారామ్ జె . పవార్ , ముకుందరావు జె . పవార్ , పి . వి . శివ శంకర్ రావు, సత్యనారాయణ రావు, పి . మహేశ్వరరావు, ఎన్ . ప్రసన్నరావు, ఎస్. దయానంద్ రావ్ , జె . కోటేశ్వర్ రావు , శ్రీను , ఎస్ . గోవర్ధన్ , జి . కార్తీక్ రావు , జి . తేజ , ఎం . హరి , ఎస్ . జయంత్ రావు , ఎం . కిరణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
.