త్వరలోనే జరగనున్న గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు కేసీఆర్ విసరనున్న వలను ఎన్నికల కమిషన్ అంటకత్తిరించేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు ప్రకటన జరిగడంతో పాపం కేసీఆర్ తాయిలాన్ని ఆపేయాల్సి వచ్చింది.
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వరదల వల్ల ప్రజలు ఎంతగానో నష్టపోయారు. ఈ నేపధ్యంలో వరద బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారంగా ఆర్ధిక సాయాన్ని అందించడానికి సన్నాహాలు ప్రారంభించింది.
వరదల వల్ల నష్టపోయిన బాధితులకు ఆర్ధిక సాయంగా పదివేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం సంకల్పించింది. కొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీ జరుగుతోంది. అయితే మరికొన్ని చోట్ల వరద సాయం అందడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా దీనిపై స్పందించిన ప్రభుత్వం ఎవరైతే వరద వల్ల నష్టపోయారో వారు తమ పేరును మీ సేవాకేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించింది. దీంతో కరోనా ప్రభావాన్ని కూడా లెక్కచేయకుండా ప్రజలు మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఇప్పటికే పేర్లను నమోదు చేసుకున్న వారికి వదర సాయం వారి ఖాతాల్లో జమ అవుతోందని తెలుసుకున్న ప్రజలు గంపెడు ఆశలతో మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే అటు ప్రజల, ఇటు ప్రభుత్వ ఆశలపై ఎన్నికల కమీషన్ నీళ్లు చల్లేసింది. డిసెంబరు 1న గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపద్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దీంతో వరద సాయానికి బ్రేక పడింది.
మరోవైపు అటు దుబ్బాక దెబ్బకు లోపల కలవరపడినా… తన పథకాలు తనకు అండగా ఉంటాయనే ధీమాతో గ్రేటర్ ఎన్నికల్లో తలపడనున్న కేసీఆర్ కు ఈసీ ఇలా అడ్డుకట్ట వేయడం చుక్కెదురుగా మారింది. పదివేల సాయంతో ఓటర్లను ఆకర్షించవచ్చనుకున్న కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఈసీ బ్రేక్ తో బెడిసికొట్టింది. మరి గ్రేటర్ ఓటర్లను ఇంకెలాంటి కొత్త గేలంతో కేసీఆర్ ఆకర్షించనున్నారో చూడాల్సివుంది.
.

Discussion about this post