చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఓ ఒప్పంద ఉద్యోగికి దేహశుద్ధి చేశారు. శనివారం పగలు ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని రూ.500 రాహు-కేతు మండపంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకోవడానికి ఓ భక్త బృందం వచ్చింది. ఈ బృందంలోని ఓ మహిళా భక్తురాలి పట్ల అదే మండపంలో విధులు నిర్వర్తించే గణపతి అనే ఓ ఒప్పంద ఉద్యోగి అనుచితంగా ప్రవర్తించాడు.
దీంతో భక్తులు అతనికి దేహశుద్ధి చేశారు. భక్తులు దాడి చేయడంతో గణపతి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తరువాత ఈ సంఘటనపై భక్తులు ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దృష్టికి తీసుకెళ్లారు.
భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో గణపతిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. కాగా ఎంతో పవిత్రమైన ఆలయంలో ఈ ఘటన జరగడం చర్చనీయంశంగా మారింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
.

Discussion about this post