పంచాయతీ ఎన్నికల్లో దక్కిన విజయాలు, 27 శాతం ఓటు బ్యాంకుతో మహోత్సాహంతో ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్.. రాబోయే మునిసిపల్ ఎన్నికలపై మరింత గట్టిగా దృష్టి పెడుతున్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతుండడంతో.. జనసేన ప్రతిష్టకు సంబంధించినది గనుక.. ఆయన మరింత ఫోకస్ పెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లకు జరగనున్న ఎన్నికల కోసం సమన్వయ కమిటీలను పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు నియమించారు. ఒక్కో నగరానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికలకు అవసరమైన అన్ని పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ సమన్వయం చేస్తుంది. అభ్యర్ధులకు అనుక్షణం అందుబాటులో ఉంటూ కావలసిన సలహా, సూచనలను కమిటీ సభ్యులు అందిస్తారు.
స్థానికంగా పార్టీ విజయానికి బాటలువేసేలా అన్ని రకాల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
విశాఖపట్నం :
- ఎ.వి.రత్నం
- పాలవలస యశస్విని
- బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
- డాక్టర్ బొడ్డేపల్లి రఘు
- పరుచూరి భాస్కరరావు
విజయవాడ :
- చిల్లపల్లి శ్రీనివాస్
- అక్కల గాంధీ
- బూరగడ్డ శ్రీకాంత్
- అమ్మిశెట్టి వాసు
- వరుదు రమాదేవి
గుంటూరు :
- సి.హెచ్. మనుక్రాంత్ రెడ్డి
- కల్యాణం శివశ్రీనివాస్ (కె.కె.)
- పాకనాటి రమాదేవి
.

Discussion about this post