తిరుమలేశుని భక్తులకు తిరుమలలో అన్నప్రసాదం అందించే నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తుడు కోటిరూపాయల భూరివిరాళం అందజేశారు.
నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపి చైర్మన్, భవాని
కన్స్ట్రక్షన్స్ ఎండి పంకజ్ రెడ్డి ఈ విరాళాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్ట్ పేరిట రూ 1,00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.
సతీసమేతంగా వచ్చి తిరుమలేశుని సేవలో పాల్గొన్న ఆయన విరాళాన్ని తిరుమల జెఇఒ ధర్మారెడ్డికి అందజేశారు.
నిత్యాన్నదానం అద్భుతః
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. తరిగొండ వేంగమాంబ అన్నదాన కాంప్లెక్సులో ప్రతినిత్యం వేలాదిమంది భక్తులకు మూడువేళలా ఉచిత అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనాలు కూడా పెడుతుంటారు.
ప్రస్తుతానికి అన్నదానం ట్రస్టుకు విరాళాలుగా వచ్చిన నిధులపై బ్యాంకులనుంచి వచ్చే వడ్డీలతోనే.. ఏడాదిపొడవునా.. అన్నదానం నడుస్తుంటుంది. అలాంటి ఈ సత్కార్యక్రమానికి ఇప్పటికీ భక్తులు ఇబ్బడిముబ్బడిగా నిధులు అందజేస్తూనే ఉన్నారు.
Discussion about this post