క్రీడా స్పూర్తిని భావితరాలకు అందించేందుకు జాతీయ కబడ్డీ పోటీలను తిరుపతి వేదికగా నిర్వహించడం జరుగుతోందని తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తిరుపతి ఇందిరా మైదానంలో ఈ నెల 5 నుండి 9 వరకు జరగనున్న జాతీయ మహిళా, పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలకు బాణాసంచాతో శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రో కబడ్డీ కన్నా మిన్నగా ఏర్పాట్లు చేశామన్నారు. ఏర్పాట్లపై ప్రతిపక్ష నాయకుల అభినందనలు తమకు మరింత బాద్యత ను పెంచాయన్నారు. తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా. శిరీష మాట్లాడు తూ 4 రోజులు తిరుపతిలో జరగ నున్న జాతీయ పండుగ కు నగర ప్రజలు విచ్చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు, అర్జున్ అవార్డు గ్రహీత హొన్నప్ప గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీ అంతరించి పోతున్న రోజుల్లో ఆదరించి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తిరుపతి నగరపాలక సంస్థ దేశంలోనే మార్గదర్శకంగా నిలుస్తున్నదని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలను తలపించేలా ఏర్పాట్లు చేయడం సమిష్టి కృషితోనే సాధ్యమవుతుందన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ పి.ఎస్.గిరీష మాట్లాడుతూ జాతీయ కబడ్డీ పండుగ విజయవంతానికి స్థానిక ప్రముఖుల భాగస్వామ్యం క్రీడాభిమానుల సంయుక్త సారధ్యంతోనే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల నిర్వహణకు బాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసుల రెడ్డి, డిప్యూటీ మేయర్లు శ్రీ భూమన అభినయ్ రెడ్డి , శ్రీ ముద్ర నారాయణ, నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ పి.యస్. గిరిషా, ఎస్వీయు వి.సి. రాజారెడ్డి, మహిళా వర్శిటీ వి.సి. జమున, వెటర్నరీ యూనివర్సిటీ వి.సి. పద్మనాభ రెడ్డి, అదనపు కమీషనర్ హరిత , ఇతర సంబందిత అధికారులు , ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్ లు పాల్గొన్నారు.
Discussion about this post