శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పరిపాలక భవన్ లో ఆలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం లో వెయ్యి లింగాల కోన తల భాగంగా చెప్పుకుంటే దేవస్థానం ఉదరభాగం గా, పాదాలు వచ్చి అర్ధనారీశ్వరిడు దేవాలయమని స్థల పురాణంలో ఉంది అన్నారు.
అర్ధనారీశ్వరుడు ఈ ఆలయంలో ఒకే లింగం లో స్వామి అమ్మవార్లు ఏర్పడి ఉన్నారని నిత్యం అక్కడ దూప దీప నైవేద్యం , నిత్యం అభిషేకాలు జరుగుతుంటాయిని ఎంతో మహిమ గలదని అన్నారు. ఇటువంటి ఆలయాన్ని తొలగిస్తున్నారన ప్రచారం చక్కర్లు కొడుతున్నాయి ని ఇది కేవలం అపోహలు మాత్రమే అన్నారు.
స్వయంభు అర్ధనారీశ్వరి దేవాలయాo ఎంతో పవిత్రమైనదని, పురాతనమైన ఆలయం కావటంతో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు అక్కడికి వెళ్లి పూజలు చేస్తుంటారని అన్నారు. నదీ ప్రవాహ ప్రాంతం కావటంతో అర్ధనారీశ్వర ఆలయాన్ని తొలగిస్తున్నారని ప్రచారాన్ని ఖండించారు.
మహాశివరాత్రి సందర్భంగా అర్ధనారీశ్వరి ఆలయం చుట్టు పక్కల పరిశుభ్రం చేయడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లో అర్ధనారీశ్వర ఆలయాన్ని తొలగించేది లేదని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఆలయానికి సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారు మరియు ఆలయానికి ని సుందరీకరణ పనులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు పసల సుమతి సాధనమున రాయల్, బుల్లెట్ జయశ్యామ్, పంతులు చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.మరియు వైసిపి నాయకులు శేఖర్ గణేష్ ధన కళ్యాణ్ సూరి తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post