తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27వ తేదీ నుంచి 400 రోజుల పాటు చేపట్టనున్న ‘యువగళం’ పాదయాత్రకు బీసీ దళాలు బాసటగా నిలుస్తాయని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడిపూడి దశరథాచారి, తెలుగునాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మాజీ కార్యదర్శి ఉమేష్ రావు తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రజలను కష్టాల పాలు చేసి దోచుకోవడం-దాచుకోవడం పైనే దృష్టి పెట్టారన్నారు. అరాచకానికి పెద్దపీట వేసి… అభివృద్ధిని అటకెక్కించిన జగన్ రెడ్డి దుష్ట పరిపాలనకు చరమగీతం పాడేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర చేస్తున్నారన్నారు.
ఈ పాదయాత్రకు బీసీ దళాలు బాసటగా ఉంటాయన్నారు. యువగళం పాదయాత్ర ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని కాంక్షిస్తూ తొట్టంబేడు మండల కేంద్రమైన పాతూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నారా లోకేష్ పేరిట ప్రత్యేక అర్చనలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆసరా పేరుతో బీసీలకు టోకరా పెట్టి… బడుగు బలహీన వర్గాల బ్రతుకులను ఛిద్రం చేసిన జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి ముందడుగు వేసి, యువగళం పేరుతో పాదయాత్ర చేయబోయే లోకేష్ బాబుకు బీసీ దళం వెన్నుదన్నుగా నిలుస్తుందన్నారు.
కుప్పంలో ఈ నెల 27న మొదలు పెట్టే యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల, మతాల వారి చల్లని ఆశీస్సులు ఉండాలని అన్ని మతాలకు చెందిన దేవుళ్ళను ప్రార్ధిస్తున్నామని వారు తెలిపారు. ప్రజా వ్యతిరేక చర్యలతో పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలనను అంతమొందించడానికి ప్రజలలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించి నాలుగు వందల రోజులు, నాలుగు వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేయాలనుకుంటున్న లోకేష్ బాబుకు అవరోధాలు సృష్టిస్తున్న జగన్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామిక వ్యవస్థకు మాయని మచ్చ అని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ గళాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.
నారా లోకేష్ బాబు ప్రజా హితం కోరి చేపడుతున్న యువ గళం పాదయాత్ర కు మేము సైతం అంటూ తొట్టంబేడు గ్రామంలోని బీసీ వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు బీమాల భాస్కర్ ముదిరాజ్, చిల్లకూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించి 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కుకున్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వన్నెకుల క్షత్రియ సాధికార కమిటీ సభ్యులు మిన్నల రవి, గాండ్ల తెలికుల సాధికార కమిటీ సభ్యులు కన్నావరం హరిబాబు, తెలుగు యువత రాష్ట్ర మీడియా సమన్వయకర్త కేవీ ప్రతాప్, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు పోలూరు శ్రీనివాసులు రెడ్డి, బీమాల మునికృష్ణ, భువన, మునిరాజా యాదవ్, గోవిందు, రామకృష్ణ యాదవ్, నాగరాజు, మురళి, చింత గింజల సునీల్, మణి యాదవ్, పోలూరు గోపాల్ రెడ్డి, వీరయ్య, తెలుగు మహిళలు పుష్పలత, సునీత, సుబ్బమ్మ, వీరమ్మ, నిరోషా, లక్ష్మి, నందిని, సుభాషిణి, రాజమ్మ, అంకమ్మ, మారెమ్మ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
.