జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణమైన రీతిలో వెనుకడుగు వేసింది. శాసనమండలి రద్దుకు గతంలో చేసిన శాసనసభ తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది. మండలి కొనసాగాలని సిఫారసు చేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకున్నదో ప్రజలందరికీ తెలుసు.
కానీ.. దీనికి సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి తాము ఉపసంహరించుకుంటున్నందుకు గల కారణాలను వివరించడానికి చాలా సుదీర్ఘ ప్రసంగంచేశారు. ఆ ప్రయత్నంలో తన చేతగానితనాన్ని బయటపెట్టుకున్నారు.
శాసనమండలి రద్దుకు చేసిన తీర్మానం 2019 నుంచి కేంద్రం వద్ద పెండింగులో ఉన్నందున.. ప్రస్తుతం మండలిలో ఉన్న సభ్యుల్లో పదవీకాలం గురించి అనిశ్చితి ఏర్పడకుండా ఉండేందుకు ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నా అనేది ఆయన ప్రధానంగా చెప్పిన మాట. ఇంత కంగాళీ, డొంకతిరుగుడు, సందిగ్ధత నిండిన వివరణ ఇంకొకటి ఉండదు. శాసనమండలి ఒకేసారి ఎన్నిక జరిగి.. ఒకేసమయంలో అందరి పదవీకాలాలు పూర్తయ్యే సభ లాంటిది కాదు. అలాంటప్పుడు పదవీకాలాల గురించిన అనిశ్చితి ఎప్పుడు తీర్మానం వచ్చినా ఉంటుంది. ఏదో తనకు తోచిన రీతిలో ఆయన దానిని సమర్థించుకున్నారు.
ఆయన చెప్పిన ఇంకో వివరణ చూస్తే నవ్వు వస్తుంది. 2019లో శాసనసభ ఏర్పడ్డాక అప్పటి పరిస్థితులను బట్టి.. మండలి అనవసరం అనుకున్నారట. ఇంతకూ ఆ ‘అప్పటి పరిస్థితులు’ ఏమిటో తెలుసా? శాసనసభలో విద్యావంతులు చాలా ఎక్కువగా ఉన్నారు గనుక.. మేధావుల, పెద్దల సభగా గుర్తింపు ఉండే మండలి అవసరం లేదని అప్పుడు అభిప్రాయపడ్డారట.
అప్పటి పరిస్థితులు – ఇప్పటికి మారిపోయాయా? అప్పట్లో శాసనసభలో విద్యావంతులు ఎక్కువగా ఉన్నారని అనుకుంటే.. ఈ రెండేళ్లలో సదరు విద్యావంతుల చదువు, మేథస్సు అంతా సర్వనాశనం అయిపోయిందా? రెండేళ్లు ఎమ్మెల్యేలుగా ఉండగానే.. వారంతా.. తెలివిహీనులు అయిపోయారా? ఇప్పుడు ఏం పరిస్థితులు మారాయి? అనేది బుగ్గనకు మాత్రమే అర్థమైన సంగతి. ఆయన చెప్పిన సమర్థింపు వాక్యాలు ఏ ఒక్కరికీ అర్థమయ్యేవి కూడా కాదు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
అప్పట్లో మూడు రాజధానుల బిల్లుకు మండలి మోకాలడ్డింది గనుక.. మండలినే రద్దు చేసే దూకుడును ప్రదర్శించారు జగన్. ఇప్పుడు మండలిలో తమ పార్టీ బలం పెరిగింది గనుక- కొనసాగిద్దాం అనుకున్నారు. ఇది మడమతిప్పడమే. అవకాశవాద వైఖరే. అది ప్రజలందరికీ తెలిసిన సంగతి. ఏం చెప్పినా సరే.. ఆలకించి నమ్మే వాళ్లు ఒక్క శాతం కూడా ఉండరు.
అలాంటి సందర్భాల్లో వీలైనంత తక్కువ మాటలు మాట్లాడి తీర్మానం ముగించి ఉంటే సరిపోయేది. ఎటూ ఆమోదించడంలో జాగు చేస్తున్నారని కేంద్రం మీద నెపం నెట్టారు.. అదొక్కటే కారణం చెప్పి.. ఉపసంహరించుకుంటే సరిపోయేది. కానీ మంత్రి బుగ్గన- ‘అప్పటి పరిస్థితులు- విద్యావంతులు- ’ అంటూ ఎక్కువ మాట్లాడడం వల్ల సమర్థించుకోవడం కూడా చులకన అయిపోయింది.
.

Discussion about this post