వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో మంగళవారం తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణి తీర్థ ముక్కోటి నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ ను స్వామి పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ స్థానికాలయాల్లో చక్రస్నానం
వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో మంగళవారం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉదయం 7 నుండి 9 గంటల మధ్య శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్కు వేడుకగా తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
శ్రీనివాసమంగాపురంలో …
శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు చక్రత్తాళ్వార్ కు శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
అప్పలాయగుంటలో ….
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు స్నపన తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు.
Discussion about this post