సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవరచుకోవాలని శ్రీకాళహస్తి డీయస్పీ విశ్వనాథ్ అన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి డీయస్పీ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారు 125 నెలలుగా దివ్యాంగులకు ఉచితంగా సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
రంజాన్ మాసం పురస్కరించుకుని ఈ సంస్థ వారు 150మందికి చీరలు దానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థను ఆదర్శంగా తీసుకుని సేవ చేయాలని సూచించారు.
ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా ఈ సంస్థలో ఒక సభ్యుడిని అన్నారు. ప్రతి ఒక్కరూ వారు చేస్తున్న పనులలో సేవాభావంతో… అందరితో కలిసిమెలసి మెలగాలని అన్నారు.
ఒకరికొకరు సాయం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మునీర్ భాష, సంస్థ సభ్యులు న్యాయవాదులు గరికపాటి రమేష్ బాబు, గుమ్మల్ల రాజేశ్వరరావు, కంఠా ఉదయ్ కుమార్, హరి నాయుడు, సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.