రైతులను తక్షణం ఆదుకోవాలని కోరుతూ.. విజయవాడ కలెక్టరుకు వినతిపత్రం సమర్పించిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదని, తప వైపు నుంచి ఎప్పటికీ ముందడుగే ఉంటుందని అన్నారు. ఓడిపోయాక భయపడిపోతాం, పారిపోతాం అని కొందరు భ్రమ పడుతున్నారని వారి ఆశలు త్వరలోనే అడియాసలవుతాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
పేకాట క్లబులు నడుపుతున్నంత సమర్ధవంతంగా ప్రజల అవసరాలను తీర్చడంలో వైసీపీ ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోశారు. ఎవరు బాధ్యతగా వ్యవహరించకపోయినా.. వాళ్ల స్థాయితో సంబంధం లేకుండా రోడ్ల మీదకు తీసుకురాగల సత్తా జనానికి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దాం అంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.
కలెక్టరుకు వినతిపత్రం ఇవ్వడానికి మచిలీపట్నం వెళ్తున్న పవన్ కు గుడివాడ వద్ద ఘనస్వాగతం లభించింది. గుడివాడలో అత్యంత భారీ పూలమాలను క్రేన్ సహాయంతో పవన్ కళ్యాణ్ కు అలంకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… మొదటసారి గుడివాడ వచ్చాను. జీవితంలో మరిచిపోలేని ఘనస్వాగతం పలికారు. ఈ అనుభూతిని చివరి శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటాను అని చెప్పారు.
Read this also : ఎఆర్ రహ్మాన్ కు మాతృవియోగం
2021 మరింత ఘోరంగా ఉండబోతోంది అంటునన్ బల్గేరియన్ జోస్యం
కంకిపాడు నుంచి గుడివాడ వచ్చే దారిలో రోడ్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలి. నిలదీయాలి. దాష్టీకానికి పాల్పడుతూ, నోటి దురుసుతో మాట్లాడే ఏ ప్రజాప్రతినిధినైనా జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుందన్నారు.
సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు.. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే… సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండ”ని హెచ్చరించారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
.