తిరుమల వేంకటేశ్వరస్వామిని సేవించుకోవడానికి పద్నాలుగేళ్ల కిందట మేల్ చాట్ వస్త్రం సేవ టికెట్ ను ఎడ్వాన్స్ బుకింగ్ గా పొందిన భక్తుడు.. టిటిడిమీద కోర్టు కేసు నెగ్గాడు. కొవిడ్ కాలంలో ఆర్జిత సేవల రద్దు కారణంగా పొందలేకపోయిన అదేసేవను మరో సారి కల్పించాలని కోరితే, టీటీడీ నిరాకరించింది. ఇప్పుడు కోర్టు ఆ భక్తుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అలా అవకాశం ఇవ్వలేకపోతే 45 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. టీటీడీ దీనిపై పైకోర్టుకు అప్పీలుకు వెళుతోంది.
భక్తులు దైవానుగ్రహంగా పొందిన సేవలను.. కొవిడ్ విపత్తు వలన పొందలేకపోయినప్పుడు.. ప్రత్యామ్నాయంగా మరో దారి లేదా? టీటీడీ సేవాటికెట్ల విషయంలో జరుగుతున్న మాయ ఏమిటి? టీటీడీ ఎందుకంత పట్టుదలగా భక్తుడి మీద పైకోర్టుకు అప్పీలుకు వెళుతోంది?
ఈ కోణాలపై ఆదర్శిని ఎడిటర్ సురేష్ పిళ్లె విశ్లేషణ వీడియో చూడండి..
Discussion about this post