తిరుమల తిరుపతి దేవస్థానాల వారి ఆధ్వర్యంలో మౌంట్ ఆబూలో తిరుమలేశుని ఆలయం ఘనంగా నిర్మాణం అయింది. ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహాన్ని తాజాగా ప్రతిష్ఠించారు.
రాజస్థాన్ రాష్ట్రం లోని మౌంట్ అబూలో సోమవారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర కామత్, రాజస్థాన్ మంత్రి ప్రమోద్ జైన్, గుజరాత్ మంత్రి జీతూ భాయ్ చౌదరి, మౌంట్ అబూ వేంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు సుబ్బారెడ్డి కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం సుబ్బారెడ్డి గుజరాత్ రాష్ట్రం అంబాజి లోని ‘అంబ’ అమ్మవారిని దర్శించుకున్నారు.
.