తిరుపతి రూరల్ మండలం సి. గొల్లపల్లి గ్రామం శ్రీ ప్రసన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం సోమవారం ఉదయం జరిగిన పుష్కర సహస్ర కలశాభిషేక శత చండీయాగంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పాల్గొన్నారు.
ఈ నెల 16 వ తేదీ నాలుగు రోజుల పాటు ఆలయం వద్ద జరిగిన కార్యక్రమాలు సోమవారం ఉదయం
శ్రీ విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి, జగద్గురు శ్రీ సాత్మానందేంద్ర స్వామి వారి అనుగ్రహ భాషణతో ముగిశాయి.
ఇందులో భాగంగా మహా కుంభాభిషేకం, మహా పూర్ణాహుతి నిర్వహించి, యాగశాలలో కలశ జలాలతో గర్భాలయంలోని మూలమూర్తులకు సంప్రోక్షణ జరిగింది.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా భూమన కరుణాకర రెడ్డిని స్వామి వారు ఆశీర్వదించారు.
.