చిత్తూరు జిల్లా, కెవిబిపురం మండలం, అంజూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం హాస్పిటల్ వైద్య బృందం మరియు నవభారత యువజన సంఘం వారు నిర్వహించారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు గరికపాటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అంజూరు గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాలు దర్భ వారి కండ్రిగ, సూర మాల, గుంటేపెడు, గ్రామ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంజీఎం వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చదలవాడ వెంకట రత్నం, వెంకటేశ్వర్లు, గిరిబాబు , సుబ్రహ్మణ్యం, మునస్వామి, చెంగయ్య, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.
.