తై అమావాస్య సందర్భంగా ఈరోజు ఈరోజు భరద్వాజ తీర్థం లో స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు విచ్చేసిన భక్తులకు సత్య భాస్కర క్షేత్ర అన్నదాన ట్రస్ట్ చే భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ఈఓ , శ్రీకాళహస్తి శాసనసభ్యులు కుమార్తె బియ్యపు పవిత్ర రెడ్డి ప్రారంభించారు.
ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్న సత్యవ్రత భాస్కర క్షేత్ర అన్నదాన ట్రస్ట్ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం భోజనం చేసి వెళ్ళారు. గత 35 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి కీర్తిశేషులు గరికపాటి రామచంద్రయ్య చేస్తూ ఉండే వారని ఈ కార్యక్రమంలో పెద్దలు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమమునకు టౌన్ బ్యాంక్ చైర్మన్ శెట్టిపల్లి సురేష్, గరికిపాటి సుధాకర్ బాబు, కొట్టే సాయి, సత్యవతి భాస్కర్ క్షేత్ర అన్నదాన ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
.