డిసెంబర్ 26,27, తేదీల్లో తిరుపతిలో జరుగనున్న ఏఐటీయూసీ జిల్లా 15వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు
ఆదివారం ఉదయం చంద్రగిరి ఏఐటియుసి నియోజకవర్గ మహాసభ ర్యాలీగా పవర్ క్లాత్ నుండి పాత ఎంపీడీవో ఆఫీస్ వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ సభ నిర్వహించారు.
ఈ సభను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి A రామానాయుడు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి లు మాట్లాడుతూ కార్మిక హక్కుల పోరాటాల రథసారథి ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా15వ మహసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 26, 27 తేదీల్లో ఘనంగా జరగనున్నాయని తెలిపారు.
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైయస్సార్ అధికారంలో పాలక ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వరంగ స్కీముల్లో పనిచేస్తున్న ఆశ అంగన్వాడి మిడ్ మీల్స్ గ్రీన్ అంబాసిడర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఏపీ స్పీపర్స్ ప్రభుత్వం మున్సిపల్ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు బ్యాంక్ బిఎస్ఎన్ఎల్ పోస్టల్ ప్రభుత్వరంగ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న ఆందోళనలకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ఆయన ప్రకటించారు.
వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన భవణ నిర్మాణ ఆటో హమాలీ పెయింటర్స్ కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఉపాధి కోల్పోయిన టువంటి ఆటో వీధి విక్రయదారులు హమాలి కార్మికులు ఆదుకొని కరోనా కాలంలో ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు
స్కూల్స్ స్వీపర్స్ పారిశుద్ధ్య ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంతో పాటు వారిని పర్మినెంట్ చేయాలని వీటి సమస్యలు పరిష్కారం కావాలంటే డిసెంబర్ 26వ తారీఖున తిరుపతిలో జరిగే టువంటి ఏఐటీయూసీ జిల్లా 15 మహాసభలకు చంద్రగిరి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మధ్యాహ్నం 12:30 నిమిషాలకు అంత తిరుపతి గోవింద స్వామి ఆర్ట్స్ కాలేజీ వరకు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శులు N శ్రీరాములు కె రాధా కృష్ణ K కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాగరాణి శ్రీనివాసులు పెట్రోల్ రవి రామారావు నగేష్ సుధాకర్ రజిని మోహన్ ఏడుకొండలు షబ్బీర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు
.