చంద్రబాబునాయుడు పట్ల వైసీపీ అవమానకరంగా ప్రవర్తించినందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
అసెంబ్లీ సమావేశంలో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మరియు సతీమణి భువనేశ్వరిని అవమానకరంగా మాట్లాడడం తెలిసిందే.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి, కొడాలి, రోజా, చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం సత్యవేడు లో మండల అధ్యక్షడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
వైసీపీ ఎమ్మెల్యేల మాటలను నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
ఈ కార్యక్రమం మాజీ ఎంపీపీ మస్తాన్, మాజీ పార్టీ అధ్యక్షులు పరమశివం నాయకులు మధు, ఈశ్వరయ్య అమాస్య రెడ్డి శశి నాయుడు పాల్గొన్నారు
.