తిరుపతిలో శుక్రవారం జరిగే ‘అమరావతి’ సభను జయప్రదం చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తిరుపతి నగరం పరిధిలోని దామినేడు సమీపంలో అమరావతి బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం ఆయన మాజీ మంత్రి అమరనాథరెడ్డి, టీడీపీ జిల్లా కన్వీనరు పులివర్తి నానితో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని’ అనే నినాదంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు హాజరవుతున్నట్లు సుదీర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టి శుక్రవారం నాటికి సరిగ్గా రెండేళ్లు అవుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ప్రధాన డిమాండు ఈ సభ ఉద్దేశ్యమన్నారు.
మహా పాదయాత్ర ముగింపు సందర్బంగా జరిగే ఈ బహిరంగ సభకు అమరావతి రాజధానిగా కొనసాగించాలనే ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరై విజయవంతం చేయాలన్నారు.
ఈ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతి నాయుడు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం కార్యదర్శి తాటిపర్తి రవీంద్రనాథరెడ్ఢి తదితరులు పాల్గొన్నారు.
.