ఓటీఎస్ పేదల మెడకు ఉరి అని టీడీపీ నేతలు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం వారు జిల్లా కేంద్రమైన చిత్తూరులో కలెక్టరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సఖ్యలో టీఢీపీ శ్రేణులు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో `1983 నుంచి 2015 మధ్య కాలంలో ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఇళ్లకు ఇపుడు డబ్బు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ స్వచ్చంధం అంటూనే క్షేత్రస్థాయిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి టార్గెట్లు ఇస్తున్నారన్నారు. ఇలా చేయడం వలన వలంటీర్లు సచివాలయ సిబ్బంది పేదల ఇళ్ల వద్దకు వెళ్లి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దకు వచ్చి డబ్బు కట్టాలని నిలదీస్తుండటంతో పేదలు మానసిక వేదనకు గురువుతున్నారన్నారు.
ఓటీఎస్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పురపాలక సంతఘాల పరిధిలో రూ.15వేలు, నగర పాలక సంస్థల పరిధిలో రూ.20వేలు వంతున వసూలు చేస్తున్నారన్నారు. ఒకేసారి డబ్బు కట్టాలని పేదలను ఒత్తిడి చేస్తుండటంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
జగన్ అవగాహనా రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. ఈ నేపథ్యంలో ఖజానా నింపుకోవడానికి ఓటీఎస్ పేరుతో పేదలపై భారం మోపుతున్నారని టీడీపీ నేతలు చెప్పారు. పేదలకు ప్రభుత్వం ఒక్కసారి ఇల్లు నిర్మించి ఇస్తే… దానిపై వారికి సంపూర్ణ హక్కు ఉంటుందన్నారు.
అయితే జగన్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ… వారికి హక్కు కల్పించడానికి డబ్బువసూలు చేస్తున్నట్లు చెబుతోందన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పేదలపై పేదలపై ప్రేమ ఉన్నట్లయితే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండు చేశారు. ఓటీఎస్ పధకానికి ఎవరూ డబ్బు కట్టకూడదని వారు విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని వారు హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరు వారు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథరెఢ్డి, జిల్లా కన్వీనరు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, శంకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ నేతలు నరసింహయాదవ్, శ్రీధర్ వర్మ, గాలి చలపతినాయుడు, లు రెడ్డివారి గురవారెడ్డి, పర్వీన్ తాజ్, నారాయణ, విజయకుమార్, చక్రాల ఉష తదితరులు పాల్గొన్నారు.
.