జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా ఓటిఎస్ సొమ్ము లు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ చక్కగా పూర్తి చేయించాలని నగర కమిషనర్ విశ్వనాథ్ చెప్పారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి బుధవారం నగరపాలక కార్యాలయంలో వార్డు అడ్మిన్ కార్యదర్శులు, వీఆర్వోలతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, వన్ టైం సెటిల్మెంట్ ను సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కల్పించాలన్నారు.
ఇంటి స్థలాలు మాత్రమే పొందిన వారి వివరాలను నమోదు చేయాలని వారికి స్థలాల రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ఏర్పాటు చేయాలన్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పై అవగాహన కల్పించారు. సమావేశంలో హౌసింగ్ డిఇ రామస్వామి రెడ్డి, టీపీవో మురళీకృష్ణ పాల్గొన్నారు.
.