వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని నగర మేయర్ ఎస్.అముద చెప్పారు.
ఇటీవల కురిసిన వర్షాలు, నీవా నదిలో వరదల కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని గురువారం జైహింద్ నగరపాలక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్ అముద మాట్లాడుతూ వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, సహాయక పునరుద్ధరణ చర్యలు వేగంగా జరుగుతుందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే నిత్యావసరాలను పంపిణీ చేసిందన్నారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ.2వేలు చొప్పున అందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రేణుక, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, తాసిల్దార్ చిట్టిబాబు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
.