మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పర్వం ముగిసిపోయింది. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించింది. ప్రెసిడెంట్ గా విష్ణు ఏకంగా 107 ఓట్ల తిరుగులేని మెజారిటీతో గెలిచాడు. అయితే ఈ విజయం తొలినుంచి అందరూ ఊహించినట్లే వెల్లడైంది.
మా ఎన్నికల ఫలితాల్లో ట్విస్టు ఏంటంటే.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ఇంచుమించు విష్ణుతో సమానంగా 106 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయితే శ్రీకాంతో మాత్రం విష్ణుకు వ్యతిరేక ప్యానెల్, ప్రకాష్ రాజ్ తరఫునుంచి పోటీచేసి గెలవడం విశేషం.
మా ఎన్నికల బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరూ బలంగా తలపడుతున్నారని తెలిసిన నాటినుంచి విష్ణు విజయాన్ని అందరూ ఊహించారు. పరభాషా నటులను తీసుకువచ్చి.. టాలీవుడ్ నటుల సంఘానికి సారథి స్థానంలో కూర్చోబెట్టాలా? తెలుగువాళ్లలో ఆ బాధ్యత నిర్వర్తించగల సమర్థులు లేరా? అనే ప్రచారం బాగానే పనిచేసింది. తెలుగువాళ్ల ఐక్యతామంత్రాన్ని మంచు విష్ణు బాగానే ఉపయోగించుకోగలిగారు. ఈ వాదనకు కౌంటర్ ఇవ్వడంలో ప్రకాష్ రాజ్ విఫలం అయ్యారనే చెప్పాలి. నటుడికి భాషాభేదాలు ఉండవు అనే పడికట్టు డైలాగులు.. ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి.
మరో రకంగా చూసినప్పుడు.. తనకు మద్దతుగా, ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మంచు విష్ణు అనేకమందిని కూడగట్టగలిగాడు. విష్ణుకు మాత్రమే ఎందుకు ఓటు వేయాలో.. ప్రకాష్ రాజ్ కు ఎందుకు ఓటు వేయకూడదో.. వారందరితోనూ వీడియో సందేశాలు చెప్పించి.. వాటిని బాగా స్ప్రెడ్ చేశాడు. ఆ ప్రభావం కొంత పనిచేసింది. కేవలం పనిచేయడం మాత్రమే కాదు.. విష్ణుకు ఎక్కువమంది పెద్దల మద్దతు పుష్కలంగా, సంపూర్ణంగా ఉన్నదనే భావన సభ్యులందరిలోనూ కలిగింది.
ప్రకాష్ రాజ్ ఈ విషయంలో ఫెయిలయ్యారు. మెగాఫ్యామిలీ ఆశీస్సులు అందుకుని.. అదొక్కటి సరిపోతుందని ఆయన అనుకున్నారు. కనీసం చిరంజీవి కూడా.. బయటకు వచ్చి.. ప్రకాష్ రాజ్ కు తప్పకుండా వేయాలని సభ్యులను అడగలేదు. చివరికి మెగాఫ్యామిలీ దన్నుతో.. పోటీగా బరిలోకి దిగిన బండ్ల గణేశ్ నామినేషన్ ఉపసంహరించుకునేలా చేయడంలో.. ప్రకాష్ రాజ్ సక్సెస్ అయ్యారు గానీ.. అదే బండ్ల గణేశ్ తో తనకు అనుకూలంగా గట్టి ప్రచారం చేయించుకోలేకపోయారు.
ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
నయీమ్ ఇట్లో పాములు తేళ్ల పెంపకం.. ఎందుకో తెలుసా?
ఇలాంటి సంకేతాలు అన్నీ కనిపించినప్పుడే.. మంచు విష్ణు విజయం దాదాపుగా ఖరారు అయింది.
ఎటూ మా ఎన్నికల్లోనూ రాజకీయ పార్టీల ఎన్నికల స్థాయి ఆవేశకావేషాలు, వ్యూహప్రతివ్యూహాలు చోటు చేసుకున్న తరువాత.. ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, ప్రతి ఓటుకు భారీగా డబ్బులు చెల్లిస్తున్నారనే పుకార్లు కూడా దండిగానే వచ్చాయి.
మొత్తానికి ఎన్నికల పర్వం పూర్తయింది. అందరూ ఊహించినట్లుగానే.. మంచు విష్ణు విజయం సాధించారు. అందరి ఊహలకు మించి.. మంచి మెజారిటీని ఆయన కూడగట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా?
ప్రజల్లో లోపమే.. ఇష్టారీతిగా ధరల పెంపుదలకు కారణమా?
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?
.
Discussion about this post