ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 13వ తేదీన జరిగే గ్రామ వార్డు సచివాలయాల ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ శ్రీకాళహస్తి ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య పిలుపునిచ్చారు.
సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని 18, 22వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జనమాల గురవయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నారని చెప్పారు. పెరిగిన ధరలతో ప్రజల జీవన పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. ధరలు, ఇంటి పన్నలు తగ్గించాలని.. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండు చేశారు.
కేంద్రంలో మోదీ… రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఈ నేనథ్యంలో ప్రభుత్వాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ శ్రీకాళహస్తి మండల కార్యదర్శి శివకుమార్, ఏఐటీయూసీ అధ్యక్షులు అయ్యప్ప, కార్యదర్శి సంగన పల్లి సురేష్, ఏఐవైఎఫ్ నాయకులు నవీన్, సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ నాయకులు గిరి, దయాకర్ నాయుడు, యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
.