శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మహిళా బాల్ – బ్యాడ్మింటన్ సెలెక్షన్స్ లో చక్కని ప్రతిభ చూపడం ద్వారా శ్రీకాళహస్తి , ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థునులైన
డిష్మిత (తృతీయ బీకామ్), జ్ఞాన ప్రసూన (తృతీయ బి.జెడ్.సి.), గాయత్రి ( తృతీయ బీఎస్సీ.) లు శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ టీం లో స్థానం సాధిచారు.
వీరు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ టీం తరపున చెన్నై లోని ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ లో ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించబడే అఖిల భారత విశ్వవిద్యాలయాల మహిళా బాల్-బాడ్మింటన్ పోటీలలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ … పోటీలలో మంచి ప్రతిభ చూపించి కళాశాలకు మంచి పేరు తేవాలని కోరుకున్నారు.
ఈ సమావేశం లో వ్యాయామ అధ్యాపకులు నరసింహ రావ్ , వైస్ ప్రిన్సిపాల్ దీన దయాల్ మరియు ఐ క్యూ ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ మహేశ్వరి పాల్గొని విద్యార్థినులను అభినందిచారు.
.