బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు జయప్రదం చేయాలని బీసీ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.
జ్యోతిరావు పూలే కమిటీ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని వరదరాజ స్వామి దేవస్థానం ఆవరణలో పూలే చిత్ర పటం ఆవిష్కరించారు.
ఈ నెల 11వ తేదీ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ చల్లా జయరామ్ మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు.
హరిజనులు, స్త్రీల కొరకు విద్యాలయాలు ప్రారంభించిన మొట్టమొదటి సంఘ సంస్కర్త ఆయన అన్నారు. సమాజంలో అంటరానితనాన్ని, అసమానతలను తొలగించాలని, వితంతు స్త్రీలకు శిరోముండనం చేసే పద్ధతిని వ్యతిరేకించి స్త్రీలకు సమాన హక్కు కోసం పోరాడిన గొప్పవ్యక్తి ఆయన అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రేణుకాదేవి, వెంకయ్య, కోట చంద్రశేఖర్, సాయి, జయ శ్యామ్, నెల్లూరు గాంధీ, గురు మూర్తి, జగదీష్, మునెయ్య తదితరులు పాల్గొన్నారు.
.