శ్రీకాళహస్తీశ్వర ఆలయ అధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సోమవారం ఆలిండియా రైస్ మిల్ ఫెడరేషన్ చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వర రావు, సూరిరెడ్డి చరిత శ్రీనిధి పేరిట రూ. 50వేలు. అదేవిధంగా వేముల ఇషిక యోగ గారి పేరిట రూ.50వేలు విరాళం అందజేశారు.
ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఈ విరాళం స్వీకరించారు. దాతలకు కృతజ్ఞతలు తెలియచేసి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంకు ఛైర్మన్, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యుక్షులు సురేష్. ఆలయ అధికారులు పాల్గొన్నారు.
.