ఉమ్మడి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి లోని సీపీఎం కార్యలయం లో చర్చా కార్యక్రమం తులసీ రాజన్ , బాలకృష్ణ అధ్యక్షతన జరిగినది .ఈ సమావేశం నకు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిలు చిన్నం పెంచలయ్య , వందవాసి నాగరాజు ముఖ్య అతిథులు గా హాజరైనారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్నికి కేంద్ర బడ్జెట్ లో తక్కువ నిధులు కేటాయించడం చాలా దారుణం అన్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ పనులు లేక ఉపాధి పనులు కల్పించడం లేదన్నారు .
ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా గుర్తించి గ్రామీణ ప్రాంతాలలో పనులు కల్పించి వలసలు నివారించాలని పని ప్రదేశంలో కూలీలు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియ చెల్లించాలని , గర్భిణీలకు ఒంటరి మహిళలకు , వికలాంగులకు చేయవలసిన పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకంలో యంత్రాలను కాంట్రాక్టర్ లను నిషేధించాలని జాబ్ కార్డు లో పేరున్న ప్రతి ఒక్కరికి వంద రోజులు చొప్పున పని కల్పించి 600 రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు . అడిగిన అందరికీ పని పని మరియు వారంవారం వేతనాలు పే స్లిప్లు పనిముట్లు మెడికల్ కిట్లు, టెంట్లు అందుబాటులో ఉంచాలని సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరించాలని అదేవిధంగా మేట్లకు ఐదు రూపాయల పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు పరిచి గ్రామీణ ప్రాంతాలలో భూమిలేని వారికి భూమి ఇవ్వాలని ఇళ్ల స్థలాలు లేని వారికి 3 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని అలా ఇవ్వకపోతే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలను గ్రామీణ పేద ప్రజలు అందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు .
ఈ సమావేశంలో యానాది సంఘం అధ్యక్షుడు చందమామల కోటయ్య , ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయుకులు మించల శివ కుమార్ , రుద్రపాకు శ్రీనివాసులు , పి . గురవయ్య , రాజయ్య , చిరంజీవమ్మ , గురవయ్య , గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post