భారతీయ జనతా పార్టీ ఓ సిద్ధాంతం కోసం పని చేసే పార్టీ. కింది స్థాయిలో పనిచేసే కార్యకర్తను గుర్తించి అత్యుత్తమ పదవులు ఇచ్చే పార్టీ. కుటుంబ ప్రీతి, బంధు ప్రీతి లేకుండా అందరినీ సమానంగా చూసే పార్టీగా పేరుంది. కానీ కొన్ని రోజులుగా చూస్తుంటే.. అవినీతి పరులకు అడ్డాగా మారుతోందని అనిపిస్తోంది.
వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి వివిధ రకాలుగా ఉంది. అవినీతి పరులు, అక్రమార్కులుగా ముద్రపడిన వారిని చేరదీయడంలో ఆ పార్టీ ముందంజలోనే ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ‘అధికార పార్టీ నుండి వేధింపులు ఎదురవుతున్నాయా.. అక్రమంగా కేసులు పెడుతున్నారా అయితే రండి.. మా పార్టీలో చేరిపోండి..’ అంటూ రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ ధోరణి ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కనిపిస్తోంది.
దక్షిణ భారతదేశంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చేసుకుంటున్నది కమలం పార్టీ. ఈ మేరకు అన్ని రంగాలకు చెందిన నేతలను, వివిధ పార్టీల్లో ఉన్న అసమ్మతి నేతలకు గాలం వేస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కోసం.. పార్టీ రాష్ట్ర వ్యవవహారాల ఇంఛార్జి తరుణ్ జోషి, హోం మంత్రి అమిత్షా ఆధ్వర్యంలో ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ మేరకు తెరాసలో నెంబర్ 2గా పేరు తెచ్చుకున్న ఈటల రాజేందర్ని పార్టీలోకి తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ యూత్లో మంచి పేరు సంపాదించుకున్న చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) పార్టీలోకి తీసుకున్నారు.
కాగా వీరిద్దరిదీ వేర్వేరు నేపథ్యం. మొదటగా ఈటల రాజేందర్ విషయం చూసుకుంటే.. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుండి సీఎం కేసీఆర్ వెంట నడుస్తూ.. అతని కుడి భుజంగా మారిపోయారు. ఒక దశలో తెలంగాణలో సీఎం మారితే ఈటలనే చేస్తారని వార్తలు వచ్చాయి. ఆలాంటి పెద్ద నేతను అనేక కారణాలతో పార్టీ నుండి వైదొలిగేలా చేశారు సీఎం కేసీఆర్. అయితే పొమ్మనలేక పొగబెట్టి.. అవినీతి పరుడుగా ముద్ర వేశారు. పేదలకు పంచిన భూములను కబ్జా చేశారని, దేవుడి భూమిని కబ్జా చేసి విలాసవంతమైన భవనం కట్టుకున్నారని ఆరోపణలు చేశారు. దీంతో పార్టీలో ఇమడలేక.. నిజం చెప్పాలంటే తన సామ్రాజ్యాన్ని, ఆస్తులను కాపాడుకోవడానికి కమలం పార్టీలో చేరారు.
ఇప్పుడు తీన్మార్ మల్లన్న పరిస్థితి కూడా అలాంటిదనే చెప్పుకోవాలి. జర్నలిస్ట్ ముసుగులో.. డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో జైలుకి పంపించారు. అతను జైలు నుండి బయట రావడానికి భాజపా సాయం చేసిందని.. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కమలం పార్టీలో చేరారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈటల , తీన్మార్ మల్లన్నల ద్వారా తెలంగాణలో భాజపా బలం పుంజుకోవడానికి మంచి అవకాశమనే చెప్పుకోవాలి.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
కానీ విపక్షాల నుంచి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి పరులంతా భాజపాలోకి చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయాలను కొట్టిపారేసిన భాజపా విపక్షాలకు దీటైన సమాధానాలు చెబుతోంది. అయితే ప్రజలు గుడ్డివారు కాదు, అన్నీ గమనిస్తుంటారు. అధికారం కోసం ఆయా పార్టీల్లో ఉన్నవారికి, ఇబ్బందులు పడుతున్నవారికి గాలం వేస్తోందనే ప్రచారం సాగుతోంది.
ఇలాంటి ఆరోపణలకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న నాయకులు ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే ఈ విషయాలకు తెరపడాలంటే ఖచ్చితంగా అధినాయకత్వం నోరు విప్పక తప్పదు మరి. కమలం మీద పడ్డ మరకలు తొలగాలంటే.. సీనియర్ నాయకులు విపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
.. కె. శ్రీనివాస్
Discussion about this post