అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరువేంకటనాధుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. పదిరోజులుగా భారీ వర్షాల కారణంగా అసలు తిరుమల చేరుకునే పరిస్థితులు లేకపోవడం, కొండమీదనే ఆగిపోయిన వారు మినహా మరెవ్వరూ దర్శనానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. పరిస్థితి కొద్దిగా సాధారణాం మారే సరికి తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది.
టీటీడి ఆన్ లైన్లో లక్షలాది దర్శన టోకెన్లను విడుదల చేసిన నిమిషాలలోనే భక్తులు పూర్తిగా బుక్ చేసేసుకుంటున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను రోజుకీ 10వేల చొప్పున ఈ ఉదయం 9గంటలకు 3లక్షల 10వేల టోకెన్లను టీటీడి ఆన్ లైన్లో విడుదల చేసింది.
కేవలం 20నిమిషాల వ్యవధిలోనే మొత్తం అయిపోయాయి. 3లక్షల 10వేల టోకెన్లను భక్తులను బుక్ చేసేసుకున్నారు.
కరోనా ఆంక్షలు కారణంగా గత 21నెలలుగా టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం లక్షలాదిగా వేచి చూస్తున్న భక్తులకు టీటీడీ నుంచి నిరాశే ఎదురవువుతోంది.
కొద్ది రోజుల క్రితం శ్రీవారి దర్శనం కోటాను పెంచుతామని టీటీడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించినా అది ఆచరణ రూపం దాల్చలేదు. టీటీడి దర్శన కోటా పెంపు అనేది డిసెంబరు నెలకు కూడా చేయలేదు. కోటా పెంచకపోవడానికి తోడు, ఆన్ లైన్ లో విడుదలైన టోకెన్లన్నీ నిమిషాల వ్యవధిలోనే పూర్తికావడంతో భక్తులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
టోకెన్లు కోటా పూర్తయిన విషయం తెలియని భక్తులు ఇంకా వేలాదిగా టోకెన్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. దర్శన కోటాను పెంచే విషయంలో టీటీడీ త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
.
.

Discussion about this post